ఈ స్కీమ్ కింద ఒకటి నుంచి 12వ తరగతి చదవుతున్న విద్యార్థుల తల్లులు ఖాతాల్లో ఏడాదికి రూ. 15 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు.
ఒక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లి ఖాతాలో రూ. 30 వేలు, ముగ్గురు ఉంటే రూ. 45 వేలు జమ చేయనున్నట్టుగా కూడా ప్రభుత్వం తెలిపింది.
విద్యార్థుల తల్లుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘‘తల్లికి వందనం’’ పథకం ప్రయోజనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాల డేటాను గ్రామ, వార్డు సచివాలయ శాఖ వద్దనున్న డేటాతో అనుసంధానం చేసి పరిశీలిస్తు డబ్బులు ఖాతాల్లోకి జమ చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలలో ‘తల్లికి వందనం’ పథకం కూడా ఒకటి.
AP Thalliki Vandanam Scheme 2025 Status Check: డబ్బులు వచ్చాయా లేదా?.స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
అధికారిక NBM పోర్టల్ ని సందర్శించండి స్టేటస్ చెక్ చైయ్యండి: https://gsws-nbm.ap.gov.in